అవి..ఇవీ..

బూట్లు ధరించలేదని విద్యార్థినికి శిక్షStudent punished for not wearing shoes

గుంజీలు తీయించడంతో స్పృహ తప్పిన ఎనిమిదో తరగతి విద్యార్థిని

ఏలూరు జిల్లా : బూట్లు ధరించకుండా పాఠశాలకు వచ్చిందనే కారణంతో ఎనిమిదో తరగతి విద్యార్థినికి వ్యాయామ ఉపాధ్యాయుడు శిక్ష విధించడంతో ఆమె స్పృహ తప్పిన ఘటన ఏలూరు జిల్లా ముసునూరు మండలం వెల్పుచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థిని తెలిపిన వివరాల ప్రకారం.. బూట్లు ధరించకుండా పాఠశాలకు వచ్చినందుకు వ్యాయామ ఉపాధ్యాయుడు తనతో 25 గుంజీలు తీయించడంతోపాటు కొట్టినట్లు ఆరోపించింది. శిక్ష సమయంలో అస్వస్థతకు గురైన విద్యార్థిని స్పృహ తప్పి పడిపోయింది. అనంతరం ప్రధానోపాధ్యాయుడు ఇతర సిబ్బంది సహాయంతో విద్యార్థినిని ఇంటికి పంపించారు. అయితే ఆమెకు తక్షణ వైద్యసాయం అందించకుండా ఇంటికి పంపించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఘటనపై సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు జూలై 16న విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *