18 నెలల్లో కర్నూలు మురుగునీటి సమస్యకు పరిష్కారంKurnool Sewage Project
కర్నూలు నగరంలోని మురుగునీరు నేరుగా తుంగభద్ర నదిలో కలవకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టును Kurnool Sewage Project చేపట్టింది. అమృత్ 2.0 పథకం కింద రూ.150 కోట్లతో నిర్మించనున్న 35 ఎంఎల్డీ సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టి.జి. భరత్ గుప్తా సోమవారం జూలై 13న శంకుస్థాపన చేశారు. ఎంపీ నాగరాజు పంచలింగాల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
18 నెలల్లో పూర్తి లక్ష్యం
సంబంధిత శాఖ తెలిపిన వివరాల మేరకు, రోజుకు 35 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే సామర్థ్యంతో ఈ ప్లాంట్ను నిర్మించనున్నారు. నిర్మాణ పనులను 18 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి టి.జి. భరత్ తెలిపారు. నదుల్లోకి మురుగునీరు చేరకుండా చూడటంతో పాటు నదీ జలాలు కలుషితం కాకుండా పరిరక్షించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని మంత్రి పేర్కొన్నారు. ఆ లక్ష్యంలో భాగంగానే కర్నూలులో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
పుష్కరాల సమస్యకు పరిష్కారం
గత కృష్ణా పుష్కరాల సమయంలో కర్నూలుకు వచ్చిన యాత్రికులు మురుగునీరు నేరుగా నదిలో కలవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి గుర్తుచేశారు. ఆ మురుగునీటి ప్రవాహం తుంగభద్రను కలుషితం చేయడంతో పాటు దిగువ ప్రాంతాల్లోనూ సమస్యలకు కారణమైందని తెలిపారు. కొత్త శుద్ధి కేంద్రం అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ప్లాంట్లో శుద్ధి చేసిన నీరు తాగడానికి అనువుగా ఉండదని మంత్రి స్పష్టం చేశారు. అయితే ఆ నీటిని పారిశ్రామిక, వ్యవసాయ అవసరాలతో పాటు ఇతర వినియోగాలకు అందించవచ్చని తెలిపారు. శుద్ధి చేసిన నీటిని అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
సంక్షేమంతో పాటు అభివృద్ధి
కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సమన్వయంతో పనిచేస్తోందని మంత్రి భరత్ అన్నారు. ఇందులో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంతో పాటు రహదారుల మరమ్మతులు, రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
స్మార్ట్ సిటీ దిశగా కర్నూలు
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలును స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు మంత్రి భరత్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు

డేటా సెంటర్ల చుట్టూ దుమారం.. నిజం ఎక్కడ? Vizag Data Centre Push Faces Water, Green Concerns
August 20, 2026, 7:04 AM IST

Dr Ainapurapu Receives National Anubhav Award 2026
August 18, 2026, 6:47 PM IST

దక్షిణాదిపై గురి.. తెలంగాణకు చోటేదీ? BJP’s New National Team Leaves Telangana Out of Southern Equation
August 18, 2026, 7:41 AM IST

అసెంబ్లీ వద్దు.. శాసనమండలి ముద్దు – ఇదేం తీరు? YSRCP Bets on Council as Assembly Boycott Continues
August 13, 2026, 7:15 AM IST

వైసీపీకి డీఎస్సీ ఆక్సిజన్.. పాలపొంగేనా? DSC Row Gives YSRCP Fresh Political Momentum in Andhra Pradesh
August 11, 2026, 7:01 PM IST
