హైదరాబాద్: అంకితభావం, అపారమైన ఏకాగ్రత ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు ప్రముఖ సూక్ష్మకళాకారిణి (Micro Artist) వందన. కంటికి కనిపించని సూక్ష్మమైన బియ్యపు గింజలపైనే తన అక్షర విన్యాసాలను చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. బియ్యపు గింజలపై శ్రీరామ నామాలను లిఖించడం ఆమె ప్రత్యేకత. ఇప్పటివరకు వందన ఏకంగా 12,22,222 బియ్యపు గింజలపై రాసి సరికొత్త చరిత్ర సృష్టించారు. అశేష భక్తులను మరింతగా భక్తి మార్గాన పయనించేలా ఆమె చేస్తున్న ఈ శ్రీరామ నామ యజ్ఞం, అసాధారణ ప్రతిభ తెలుగువారందరికీ గర్వకారణంగా నిలుస్తోంది.
